– అభినందిస్తూ సన్మానించిన తోటి ఉద్యోగులు
నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)
నారాయణపేట జిల్లా కేంద్రంలోఎస్ టి ఓ గా పనిచేస్తున్న రాజగోపాల చారి ఏటీవో గా ప్రమోషన్ పొందడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం తోటి సిబ్బంది రాజగోపాలచారికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఏటీవో గా పదోన్నతి పొందిన రాజగోపాలాచారి మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదోన్నతి అవకాశాన్ని సద్వినియోగం చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..
