PM Modi: ఒడిశా రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అభివృద్ధి ప్యాకేజీని అందించారు. శనివారం (సెప్టెంబర్ 27) ఝార్సుగూడ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా పాల్గొన్నారు.
PM Modi: ప్రధాని మోదీ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో 97,500కు పైగా 4G మొబైల్ టవర్లు నిర్మించబడ్డాయి. వీటిలో BSNL ఏర్పాటు చేసిన 92,600 టవర్లు కూడా ఉన్నాయి. డిజిటల్ ఇండియా ఫండ్ కింద 18,900 టవర్లు అమలు అయ్యాయి.
ఇది కూడా చదవండి: Traffic Diversions: గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపులు – భక్తులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు
ఈ టవర్లు ముఖ్యంగా 26,700 గ్రామాలను—మారుమూల, సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను కలుపుతాయి. దీని ద్వారా 2 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు కనెక్టివిటీ పొందనున్నారు. ముఖ్యంగా ఇవన్నీ సౌరశక్తితో నడిచే గ్రీన్ టవర్లు కావడం విశేషం.
రైల్వే ప్రాజెక్టులు
- సంబల్పూర్–సరళ రైలు ఫ్లైఓవర్ శంకుస్థాపన
- కోరాపుట్–బైగూడ లైన్ డబ్లింగ్
- మనబార్–కోరాపుట్–గోర్పూర్ లైన్ అభివృద్ధి
ఇది కూడా చదవండి: RBI New Rules: మరణించిన కస్టమర్ల క్లెయిమ్లు పరిష్కరించాలి – ఆలస్యం అయితే పరిహారం తప్పదు!
ఈ ప్రాజెక్టులు ఒడిశా తో పాటు పొరుగు రాష్ట్రాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. పరిశ్రమలు, వాణిజ్యానికి ఊతమిస్తాయి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాని మోదీ బెర్హంపూర్–ఉధ్నా (సూరత్) మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇది అంతర్రాష్ట్ర ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. పర్యాటకానికి, ఉపాధికి కొత్త అవకాశాలను తెస్తుంది.
ఆరోగ్య రంగంలో అభివృద్ధి బెర్హంపూర్లోని MKCG మెడికల్ కాలేజీ, సంబల్పూర్లోని VIMSAR లను ప్రపంచ స్థాయి సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ఒడిశాను దేశ ఆర్థిక, సామాజిక పురోగతిలో ముందుకు నడిపిస్తాయని కేంద్రం పేర్కొంది.
