Sai Pallavi – Dhanush: తమ మధ్య కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ – సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, ఈ ప్రకటనతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
మారి 2లో ధనుష్, సాయి పల్లవి కలిసి నటించారు. ఇది ‘మారి’ సినిమాకు సీక్వెల్గా 2018లో విడుదలైంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సినిమాలో ధనుష్ – సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి చేసిన ‘రౌడీ బేబీ’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ పాటకు ఉన్న ఆదరణ తగ్గలేదు.
ఆ సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కనిపిస్తోంది. ధనుష్ హీరోగా, దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో సాయి పల్లవిని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇది ధనుష్ కెరీర్లో 55వ సినిమా కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘D 55’ అనే వర్కింగ్ టైటిల్తో ముందుకు సాగుతోంది.
Sai Pallavi – Dhanush: అమరన్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ధనుష్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపించాయి. ఇప్పటికే ధనుష్ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మరో హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకున్నట్లు వెల్లడించారు.
She’s about grace and strength – all at once ❤️
Welcoming everybody’s favourite @Sai_Pallavi92 on board #D55. The hit combo returns to the big screen.@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr… pic.twitter.com/zycf0OiQKu
— Wunderbar Films (@wunderbarfilms) February 2, 2026
సాయి పల్లవి ఎంపికపై చిత్ర బృందం స్పందిస్తూ, “ఆమెలో గ్రేస్, స్ట్రెంత్ రెండూ ఒకేసారి కనిపిస్తాయి. మనందరి ఫేవరెట్ సాయి పల్లవికి #D55 ప్రాజెక్ట్లోకి స్వాగతం. ఈ హిట్ కాంబో మళ్లీ వెండితెరపైకి వస్తోంది” అని పేర్కొంది. ఈ ప్రకటనతో పాటు ధనుష్, సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి కలిసి ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘రౌడీ బేబీ’ మాజిక్ మళ్లీ చూడాలని ఆశపడుతున్నారు. కథ, పాత్రల గురించి మేకర్స్ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఈ కాంబినేషన్నే సినిమాకు పెద్ద ప్లస్గా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
