RBI New Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన కస్టమర్ల ఖాతాలు, లాకర్లు, సేఫ్లకు సంబంధించిన క్లెయిమ్లను ఇకపై బ్యాంకులు 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. సమయానికి పరిష్కరించకపోతే నామినీకి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఈ కొత్త నియమాలు మార్చి 31, 2026 నుండి అమల్లోకి రానున్నాయి.
RBI New Rules: ఈ నియమాలు మరణించిన వ్యక్తి డిపాజిట్ ఖాతాలు, సేఫ్ లాకర్లు, బ్యాంకులోని సేఫ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఖాతాలో నామినేషన్ లేదా సర్వైవర్షిప్ నిబంధన ఉంటే, బ్యాంకు నామినీ లేదా సర్వైవర్కు నిధులను చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించిన వెంటనే బ్యాంకు బాధ్యత నుండి విముక్తి పొందినట్లుగా పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి: Success Story: తన పంక్చర్ల షాపు ముందు డీఎస్పీ గా కూతురు.. ఆ తండ్రికి ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఉంటుందా?
- తక్కువ మొత్తాల క్లెయిమ్లు: సహకార బ్యాంకులకు రూ. 5 లక్షల వరకు, ఇతర బ్యాంకులకు రూ. 15 లక్షల వరకు సరళీకృత విధానం అనుసరించాలి.
- ఎక్కువ మొత్తాల క్లెయిమ్లు: వారసత్వ ధృవీకరణ పత్రం లేదా ఇతర చట్టబద్ధ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
మరణించిన కస్టమర్ల లాకర్ లేదా సేఫ్ క్లెయిమ్లను కూడా బ్యాంకులు 15 రోజుల్లోగా పరిష్కరించాలి. అవసరమైన అన్ని పత్రాలు స్వీకరించిన తర్వాత, వారసుడితో సంప్రదించి లాకర్ను జాబితా చేయడానికి తేదీని షెడ్యూల్ చేయాలి.
ఆలస్యమైతే ఏమవుతుంది?
- డిపాజిట్ ఖాతాలు: క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యమైతే, బ్యాంకు సెటిల్మెంట్ మొత్తానికి ప్రస్తుత వడ్డీ రేటు + 4% అదనంగా వడ్డీ చెల్లించాలి.
- లాకర్లు: లాకర్ క్లెయిమ్లో ఆలస్యం జరిగితే, ప్రతి రోజూ రూ. 5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త నియమాలతో నామినీలకు సౌకర్యం కల్పించడం, ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా జరగడం RBI ప్రధాన ఉద్దేశం. ఇకపై బ్యాంకుల ఆలస్యాలకు బాధపడాల్సిన అవసరం లేకుండా, క్లెయిమ్లు సులభంగా పరిష్కారమవుతాయని RBI స్పష్టం చేసింది.
