T20 World Cup 2026: రెండో రోజు మూడు కీలక మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

టీ20 ప్రపంచ కప్ 2026 రెండో రోజున చెన్నై, ముంబై, కొలంబో వేదికలుగా మూడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్–ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్–నేపాల్, శ్రీలంక–ఐర్లాండ్ పోటీలు అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Hyderabad: హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలుహైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం: ఇద్దరు మృ*తి, ఐదుగురికి గాయాలు

హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో జూ పార్క్ నుంచి వస్తున్న బోరంపేటకు చెందిన ఇద్దరు మృ*తి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. భూపాలపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో స్కూల్ బస్సు కాలిపోయిన ఘటనలో 15 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.

Andhra Pradesh: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వ తీపికబురు: ఒక్కొక్కరికి రూ.3.65 లక్షల రుణ సాయం

టిడ్కో ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిన 39 వేల మంది లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.3.65 లక్షల రుణ సాయం అందించనుంది. ఈ చర్యతో ఇళ్ల నిర్మాణం వేగవంతమై, జూన్ నాటికి లక్షలాది ఇళ్లను అందజేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.

Ekalavya Model Schools: ఏపీలో ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఉచిత విద్య: ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏపీలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలతో పాటు సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదువుకునే అవకాశాన్ని ఈ స్కూల్స్ అందిస్తున్నాయి.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్.. అమెరికాతో తలపడనున్న భారత్

టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో భారత్–అమెరికా తలపడనున్నాయి. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు టైటిల్ రక్షణ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా, అమెరికా జట్టు మళ్లీ గట్టి సవాల్ విసరాలని చూస్తోంది.

Tiger captured: తూర్పు గోదావరిలో పెద్దపులి భయం ముగిసింది, అటవీ శాఖ విజయవంతమైన రెస్క్యూ

తూర్పు గోదావరి జిల్లాలో ఆరు రోజులుగా భయపెట్టిన పెద్దపులిని అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. మత్తు ఇంజెక్షన్‌తో అదుపులోకి తీసుకుని విశాఖపట్నం జూకు తరలించడంతో స్థానికులకు ఊరట లభించింది.

Suryavanshi: రికార్డుల సూర్యవంశీ.. అండర్-19 ప్రపంచ కప్‌ ఫైనల్లో వైభవ్ వీరవిహారం.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘనవిజయం

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు ఉండగా, భారత్ 411 పరుగుల భారీ స్కోరుతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆరోసారి టైటిల్ గెలుచుకుంది.

Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ నజరా: మచిలీపట్నం పోర్టుకు రూ. 574 కోట్లతో 6 లైన్ల రహదారి

మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో అనుసంధానించడానికి రూ. 573.77 కోట్లతో 6 లైన్ల రహదారిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో మూడు ఫ్లైఓవర్లు, ఒక రైల్వే బ్రిడ్జ్ ఉన్నాయి, ఇది ఏపీ రవాణా రంగానికి పెద్ద ఊరటనిస్తుంది.

WPL Title: RCB మహిళల జట్టు రెండోసారి WPL ఛాంపియన్, ఢిల్లీపై 6 వికెట్ల ఘన విజయం

WPL Title: RCB మహిళల జట్టు రెండోసారి WPL టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.